మాదాపూర్ డివిజన్ మౌళికవసతుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాం..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
మాదాపూర్ డివిజన్ పరిధిలోని జూబ్లీ గార్డెన్,కొండాపూర్ మీదుగా ఖానమేట్ మీనాక్షి టవర్స్ నందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి జి.ఎం శ్రీ.రాజశేఖర గారు,సి.జి.ఎం.అనిల్ కుమార్,డి.జి.ఎం శ్రీ.శ్రీమన్నారాయణ గారు,ఇంజినీరింగ్ ఈ.ఈ చిన్న రెడ్డి గారు, మేనేజర్ శ్రీ.ప్రభాకర్ గారితో కలసి పరిష్కరించే దిశగా అడుగులు వేశారు.
ముఖ్యంగా ఈరోజే చేపట్టిన పనులవల్ల జూబ్లీ గార్డెన్ మీదుగా కొండాపూర్ నుంచి వచ్చే డ్రైనేజ నీరు ఖానమేట్ మీనాక్షి వద్ద ఉన్న మాన్ హోల్ క్లీన్ చేయడం మీద నుంచి వచ్చే నీరు కాలనీలో పొంగిపొర్లకుండ ఉండేదుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు…
కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
మన పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని,కరోనా వైరస్ మహమ్మరిని అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకుంటుందని,ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ దృష్టిని వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్,శ్యామ్,సర్వర్ తదితరులు పాల్గొన్నారు..
Telangana
Nalla Sanjeeva Reddy
Bureau Chief
South India
NAC NEWS CHANNEL.