శేరిలింగంపల్లి: ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరు ఆకలితో ఉండవద్దని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేసి నిరుపేదల ఆకలి తీర్చాలని శేరిలింగంపల్లి తెరాస యువజన నాయకులు గుర్ల తిరుమలేష్ సూచించారు. ఈ సమయంలోనే మనం సాటి మనిషికి సహాయం చేసి మానవత్వాన్ని నిలుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం నాడు రాజీవ్ గృహకల్ప లోని నిరుపేదలకు నిత్యవసర వస్తువులు ఆహార పదార్థాలు, వారానికి సరిపడ సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిద్ -19 వైరస్ తో ప్రపంచమంతా అతలాకుతలమౌతున్న నేపథ్యంలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ మహమ్మారిని తరిమికొట్టాలని లాక్ డౌన్ నిర్వహించిన ఎవరు ఆకలితో ఉండవద్దని అందుకోసం రాజీవ్ గృహకల్ప లో నివసించే నిరుపేదలకు నిత్యవసర వస్తువులు 5 కిలోల బియ్యం, 1 కేజి కంది పప్పు, 1 కేజి నూనే ప్యాకెట్,1 ఆలుగడ్డ, 1 కేజి టమాట,1 కిలో వంకాయ, 1 కిలో ఉల్లపాయలతో పాటు చిరు వస్తువులు పంపిణీ చేశారు. మనకు ఉన్న దాంట్లో ఎంతోకొంత పేద ప్రజలకు మానవతా దృక్పథంతో వారిని ఆదుకున్నట్లయితే వారు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను సంపూర్ణంగా పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ నియంత్రణకు ఎలాంటి మందులు లేవు కాబట్టి ప్రభుత్వాల సూచనల మేరకు మనమందరం వాటిని తూ.చ. తప్పకుండా పాటించాలని వారు స్థానిక ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్ల తిరుమలేష్ తోపాటు ఫోటో జర్నలిస్ట్ కుమార్ పలువురు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.