TELANGANA
ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలి..
GHMC MADHAPUR
CORPORATOR V.JAGDEESHWAR GOUD
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ననుసరించి,ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలని,మహమ్మారి కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈరోజు డివిజన్ పరిధిలోని మైత్రి నగర్,పర్ఫెక్ట్ టవర్స్,మాధవ నగర్, జి.హెచ్.ఎం.సి సిబ్బంది చే శానిటేషన్ స్ప్రే చేయించారు…
కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని,
మాదాపూర్/హఫీజ్ పెట్
డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ,బస్తీలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటామని తెలిపారు,శానిటేషన్ సిబ్బంది వారి ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం పనిచేస్తున్నారని,ప్రజలు సహకరించి ఇళ్లలోనే ఉండాలని కోరారు..
నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో
ఎన్ ఏ సి న్యూస్ చానల్
సౌత్ ఇండియా.